ఈ యాప్తో సంపాదించుకున్నోళ్లకి సంపాదించుకున్నంత
posted on May 28, 2017 5:39PM
ఇప్పటికే యూట్యూబ్, గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా ఎంతోమందికి ఆదాయాన్నిఅందిస్తున్న ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మరో సరికొత్త యాప్ను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఓపీనియన్ రివార్డ్స్ అనే ఈ యాప్లో సర్వేలకు యూజర్లు సమాధానం ఇస్తే చాలు..వారికి రివార్డుల రూపంలో గూగుల్ చెల్లింపులు జరపనుంది. వాటిని గూగుల్ ప్లే స్టోర్లో జరిపే కొనుగోళ్లకు క్రెడిట్ రూపంలోనూ వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే సింగపూర్, టర్కీ, మార్కెట్లలో ఈ ఓపీనియన్ రివార్డ్స్ యాప్ను గూగుల్ విడుదల చేసింది.
దీనిని ఎలా వాడుకోవాలంటే:
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు ఒక్కసారి సైన్ అప్ అయి..సర్వేలకు సమాధానం ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఈ సర్వేను 24 గంటలలోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ యాప్లో యూజర్లు తమ పేరు, చిరునామా వంటి ప్రాథమిక సమాచారం అందించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ సమాచారాన్ని ఎవరితో పంచుకోబోమని యాప్ యూజర్లకు హామీగా ఉంటుంది.