సీఎం పదవికి రాజీనామా చేయనున్న ఊమెన్ చాందీ..

 


కేరళ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎల్డీఎఫ్ పార్టీ గెలుపొంది.. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఊమెన్ చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్ పరాజయం పాలైంది. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న ఊమెన్ చాందీ ఈ రోజు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ పి.సదాశివమ్ కు రాజీనామా లేఖను సమర్పించనున్నారు. కాగా కేరళలో మొత్తం 140 స్థానాలకి ఎన్నికలు జరగగా.. వాటిలో ఎల్డీఎఫ్ 91 స్థానాలలో, యూడీఎఫ్ 47 స్థానాలు, బీజేపీ ఒక స్థానం.. ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.