మరో రాజ ప్రాసాదం కొత్త పార్లమెంటు భవనం
Published on: Fri May 19, 2023 5:15PM
రాజులు పోయారు. రాచరికాలు పోయాయి. రాజప్రసాదాలు మాత్రం వారి చిహ్నాలుగా నిలిచిపోతున్నాయి. వేల సంవత్సరాల నుంచి పాలకులు తమ మార్కును ప్రదర్శించాలనుకుంటున్నారు. ప్రస్తుతమున్న రాజప్రసాదాలు అలనాడు కట్టిన అపురూప సౌందర్య సౌధలు. ప్రస్తుతమున్న పార్లమెంటు భవనం కూడా ఆ కోవలోకే వస్తుంది. ప్రధాని మోడీ ఈ నెల 28న వీరసావర్కర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిజాం నాటి కట్టడాన్నికూల్చేసి కొత్తగా సచివాలయం కట్టడానికి పెద్ద లాజిక్ లేదు. తమ పాలనలో నిర్మితమైన తీపి గుర్తులు ప్రజల మదిలో తర తరాలుగా నిలిచిపోవడానికి ఇలా కట్టడాలు నిర్మిస్తారని చెప్పడానికి ఇతరత్రా కారణం లేదు. పాలకులు తమకు గుర్తింపు చిహ్నాలు నిర్మించాలన్న ఆకాంక్షతో యాదగిరి గుట్ట దేవాలయం, తెలంగాణ సచివాలయ పునర్ నిర్మాణం అని వేరే చెప్పనవసరం లేదు. నిజాం కాలం నాటి కట్టడాన్ని స్వాతంత్ర్యం అనంతరం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సచివాలయం పాత సెక్రెటేరియట్ భవనం. ఇతరత్రా అవసరాలకోసం ఆ భవనాన్ని వినియోగించుకోవచ్చు. కానీ ఆఘమేఘాల మీద ఆ భవనాన్ని కూల్చేసి కొత్త సచివాలయాన్ని పెర్సియన్ శైలిలో కట్టారు.
ప్రస్తుతం కట్టిన పార్లమెంటు భవనం గూర్చి పరిశీలిస్తే ఆసక్తికర కథనాలు అనేకం ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
న్యూఢిల్లీలోని సంసద్ మార్గ్ లో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అక్షరాల రూ 862 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది.
సెంట్రల్ విస్తా రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు చేపట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టను మరింత ఇనుమడింప జేసే విధంగా దీన్ని నిర్మించారు. ఇండియా గేట్ రాష్ట్రపతి భవన్ మధ్య ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ కట్టడాన్ని నిర్మించే బాధ్యత టాటాప్రాజెక్ట్స్ లిమిటెడ్(టిపిఎల్) కు దక్కింది. 2020 అక్టోబర్ 20వ తేదీన ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ కొత్త పార్లమెంట్ భవనం ఈ సవత్సరం ఆగస్టులో ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ కంటే నెల రోజుల ముందే ఈ భవనాన్ని వీరసావర్కర్ జన్మ దినోత్సవాన్నిపురస్కరించుకుని ప్రారంభించనున్నారు. 1927సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం నిర్మించిన కట్టడంలోనే ఇప్పటి వరకు పార్లమెంటు భవనం కొనసాగింది. ఆ భవనం స్థానే దీన్ని నిర్మించారు.
65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం నాలుగు అంత స్థుల్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ నూతన భవనానికి 6.5 మీటర్ల ఎత్తులో ఉన్న జాతీయ పతాక చిహ్నం, ఆసియాటిక్ నాలుగు సింహాలు హైలైట్ అని చెప్పొచ్చు.


