TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక్క రోజే 71 తీర్పులతో సరికొత్త రికార్డు 

Published on: Fri Jun 16, 2023 4:00PM

తెలంగాణా హైకోర్టు   న్యాయమూర్తి సూరేపల్లి నంద  కొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా ఒక్క రోజు 71 తీర్పులను వెలువరించి చరిత్ర తిరగరాశారు.  హైకోర్టు చరిత్రలో నందా ఇచ్చిన తీర్పులు  అసమానమైనవిగా భావిస్తున్నారు.  వేసవి సెలవుల  తర్వాత హైకోర్టు పున: ప్రారంభం రోజునే అనేక తీర్పులు వెల్లడించారు. ఈ కేసులు న్యాయమూర్తి ప్రస్తావించిన అంశాలు చోటుచేసుకున్నాయి.  మరో వైపు  న్యాయమూర్తి సూరేపల్లి నందా కోర్టులో తీర్పులు చెప్పడం ద్వారా న్యాయ ప్రక్రియలో పారదర్శకతను పెంచాయి. ఒకేసారి  గణనీయ సంఖ్యలో తీర్పులు వెలువరించారు.  దీంతో నిస్సందేహంగా కేసుల బ్యాక్‌లాగ్‌ను కొంతమేరకు తగ్గించందనడంలో ఎలాంటి సందేహం లేదు.  కోర్టులో పేరుకుపోతున్న కేసుల నేపధ్యంలో బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయడం ద్వారా న్యాయస్థాన వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. వ్యాజ్యదారులకు సకాలంలో న్యాయాన్ని అందించడంలో సహాయపడుతుంది న్యాయవ్యవస్థ యొక్క సమర్థవంతమైన పనితీరును ప్రోత్సహిస్తుంది. జడ్జి సూరేపల్లి నందా ఒకేసారి పెద్ద ఎత్తున తీర్పులతో న్యాయ వ్యవస్థ పై ప్రభావం పడి విశ్వసనీయతకు దోహదం చేస్తాయి. 1969లో జన్మించిన సూరేపల్లి నందా 28 ఏళ్లపాటు హైకోర్టులో సివిల్‌, క్రిమినల్‌ సహా అన్ని విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. బీఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌, ఎల్‌ఎల్‌బీ విద్యను పూర్తిచేశారు. 1993లో హైకోర్టు న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరఫున అనేక కార్యక్రమాల్లో సేవలు అందించారు. ఇటీవలే హైకోర్టు ఆమెను డిజిగ్నేటెడ్‌ సీనియర్‌ న్యాయవాదిగా గుర్తించి న్యాయమూర్తిగా అవకాశం ఇచ్చారు.