TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుక్కెడు మంచినీళ్ల‌కోసం..ప్రాణాల‌కు తెగించిన పెద్దాయ‌న‌

Published on: Sun Oct 9, 2022 8:17PM

చింటూకి అమ్మ మంచినీళ్లు తాగి స్తుంది, అత్త‌గారికి కోడ‌లు గ్లాసు తో ఇస్తుంది, మీ ఊళ్లో మంచినీళ్ల చెరువో, బావో ఉండొచ్చు. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హ‌మీర్‌పూర్ గ్రామ‌ స్తులు గుక్కెడు మంచినీళ్లు తేవ‌డానికి ప్రాణాల‌కు తెగించా ల్సివ‌స్తోంది. ఉత్తర ప్రదేశ్ హమీర్ పూర్ జిల్లా సిసోలార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బచా కహానీ గ్రామ‌స్తులు మాత్రం చావో గ్లాసుడు మంచినీళ్లో అని నిత్యం మంచినీటికోసం యుద్దం చేస్తు న్నారు...ఊబితో!

ఇక్క‌డి నీళ్లు తెచ్చుకోవ‌డానికి ప్రతిరోజూ చాలా మంది తమ ప్రాణాలను పణం గా పెట్టవలసి వ‌స్తోంది. ఒక పెద్దాయ‌న నడుము లోతుగా ఊబిలో మునిగిపోవడం చూడవచ్చు, అయితే ఒక వ్యక్తి చెక్క కర్రను పట్టుకోమని చెప్పి అతనిని బయటకు తీయడా నికి ప్రయత్నించాడు. వృద్ధుడి పక్కనే ఒక స్టీల్ బిందె కనిపిస్తుంది, దానితో అతను నీటిని సేకరించడానికి నదికి వెళ్ళాడు. అనేక ప్రాంతాలలో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు ప్రతి ఇంటికి కుళా యి నీటిని ఇస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానంపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశ్నలను లేవనెత్తారు. ఒక పోలీసు కూడా నవ్వుతూ తన ఫోన్‌లో రెస్క్యూ ప్రయత్నాన్ని రికార్డ్ చేయ‌డం విమర్శలకు దారితీసింది.

వైరల్ వీడియో హమీర్‌పూర్ జిల్లాలోని సిసోలార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బచా కహానీ గ్రామానికి చెందినది. ఈ కుళాయి నీరు ఉప్పుమ‌యం కావ‌డంతో తాగడానికి పనికిరాదని, దీంతో గ్రామస్తులు నది నుంచి నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. నమామిగంగే మిషన్‌కు సంబంధించి రాష్ట్ర జలశక్తి మంత్రి ఇటీవల హమీర్‌పూర్‌ను సందర్శిం చారని, త్వరలో కుళాయి నీరు అందుతుందని స్థానికులకు హామీ ఇచ్చారని మరో స్థానికుడు సూచించారు. ఇది ఎలా కార్యరూపం దాల్చుతుందో ఖచ్చితంగా తెలియద‌ని అతను చెప్పాడు.