'ఓలా' సర్వీసుకు ఏపీ లో పాక్షిక వెసులుబాటు

అత్యవసర ఆరోగ్య అవసరాల ప్రయాణాలకి ఓలా ట్రావెల్స్ కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేయాలనీ నిర్ణయించింది. డయాలసిస్, క్యాన్సర్, హార్ట్ సంబందిత అత్యవసర సమయాల్లో పేషెంట్, మరొకరికి అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం -రాష్ట్రం లో లాక్ డౌన్ కు పాక్షిక మినహాయింపు ఇచ్చినట్టు అయింది. ఈ లెక్కన చూస్తే, 15 వ తేదీ నుంచి ఏ పీ ఎస్ ఆర్ టీ సి సర్వీసులు కూడా పాక్షికంగా నడిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.