వంతెనపై నుండి కింద పడ్డ బస్సు...

 

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పై వెళుతున్న బస్సు అదుపుతప్పి కిందకి పడిపోయింది. వివరాల ప్రకారం..ఒడిశాలోని అంగుల్ జిల్లాలో వంతెనపై నుంచి వెళుతోన్న బ‌స్సు అదుపుత‌ప్పి కింద‌కు ప‌డిపోయింది. ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెంద‌గా 25 మందికిపైగా ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. అందులో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గాయాల‌పాల‌యిన వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి తర‌లిస్తున్నారు. ప్ర‌మాద‌స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.