రెచ్చిపోయిన మావోలు...సూపర్‌వైజర్‌ గొంతుకోసి చంపారు..

 

ఒడిశాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు. ఒడిశాలోని సిమిలిగూడ మండలం బిత్తర్‌కోట వద్ద రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. రహదారి నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ వీరు వాహనాలకు నిప్పుపెట్టారు. అక్కడితో ఆగకుండా ఇన్‌ఫార్మర్ నెపంతో రోడ్డు నిర్మాణ పనుల సూపర్‌వైజర్‌ను గొంతుకోసి చంపారు.