ఓదార్పులకు సిద్దంకండహో

 

జగన్ జైల్లో ఉన్నంత కాలం ఆయనను ఎవరూ ఓదార్చకపోయినా, ఆయన మాత్రం ప్రజలను ఓదార్చడం తన బాధ్యతగా భావించడం గొప్ప విషయమే. ఈ నెల 16నుండి ఆయన ఓదార్పు యాత్ర మొదలవుతుందని సమాచారం. అందుకే వైకాపా ఆయన ఓదార్చవలసిన వారి లిస్టులు బయటకు తీసి సిద్దం చేస్తోంది. మనుషులు పోయిన నాలుగేళ్ళయినా, నలబై ఏళ్ళయినా కూడా ఓదార్చవచ్చని దీనిని బట్టి అర్ధం అవుతోంది. అందువలన ఆ లిస్టులో పేర్లున్నవాళ్ళు అందరూ మళ్ళీ జగన్ ఓదార్పుకి సిద్దంగా ఉండాలి.ఇక త్వరలో మొదలయ్యే ఈ ఎమ్మోషనల్ డ్రామాను ప్రజల ముందు ఉంచేందుకు సాక్షి కూడా సిద్దంగానే ఉంటుంది. అయితే ఎన్నికలు ఆరు నెలలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాల ద్వారా విలువయిన సమయం వృదా చేసుకొనే బదులు అదేదో టికెట్ల పంపకాలు, పార్టీ నిర్మాణం వంటి విషయాలకు కేటాయిస్తే ఫలితం ఉంటుంది కదా! అని ఆ పార్టీ నేతలే సణుగుతున్నారు.