మిస్ అమెరికాకు విందు ఆహ్వానం...?

 

మిస్ అమెరికాగా గెలుపొందిన నీనా దావులూరిను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌లు వైట్ హౌస్‌లో జరిగే విందుకు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లుగా అమెరికా మాజీ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. విజయవాడకు చెందిన తెలుగమ్మాయి నీనా దావులూరి అమెరికాలో సగర్వంగా మిస్ అమెరికాగా గెలుపొంది... అందాల కిరీటాన్ని దక్కించుకుంది. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ... ఒబామా, మన్మోహన్ సింగ్ భేటీ నేపథ్యంలో జరిగే విందుకు నీనాను కూడా ఆహ్వానిస్తే బాగుంటుందని, అదే విధంగా ప్రవాస భారతీయుల సేవలను రెండు దేశాలు కూడా గుర్తించినట్టు ఉంటుందని అన్నారు.