పన్నీర్ కు అదనపు బాధ్యతలు...
posted on Aug 22, 2017 6:00PM
పన్నీర్ సెల్వం వర్గం, పళని స్వామి వర్గం నిన్న విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం నిన్న డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మరిన్ని బాధ్యతలు ఆయనకు కేటాయించినట్టు తెలుస్తోంది. ముందుగా ఆయనకు ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖలను కేటాయించారు. ఇప్పుడు ఆయనకు ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలు, ఎన్నికలు, పాస్పోర్ట్స్ శాఖలు అదనంగా అప్పగించారు. ఇంతకుముందు ఈ శాఖలను డి. జయకుమార్ నిర్వహించారు. ఆయనకు మత్స్యశాఖ, సిబ్బంది మరియు పరిపాలన సంస్కరణల శాఖ కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.