ఏపీ రాజధాని నూజివీడు?

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూజివీడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటు ,సేకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే రాజధానిపై ప్రకటన ఆలస్యం చేస్తే, అనవసరంగా ఊహాగానాలు, ఆందోళనలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని కూడా మంత్రివర్గం అభిప్రాయపడింది. విజయవాడ,గుంటూరు నగరాలు కలిసి అభివృద్ది చెందేలా నిర్ణయం చేయాలని మొదట భావించినప్పటికీ భూముల సేకరణలో సమస్య వుంటుందన్న అభిప్రాయంతో ఇప్పుడు నూజివీడు మీద దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.