త్వరలో పార్లమెంటు ఆవరణలో నందమూరి వారి విగ్రహం

 

 

ఎట్టకేలకు పార్లమెంటు ప్రాంగణంలో తెలుగు సినీ జగత్తులో రారాజుగా వెలిగిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుగారి విగ్రహం పెట్టబోతున్నారు. ఆయన కుమార్తె శ్రీమతి పురందేశ్వరి కృషివల్లనే ఇది సాద్యం అయింది. లోక్ సభ స్పీకర్ మీరా కుమారిగారు వచ్చేనెల 7వ తేదీన ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. శ్రీమతి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, తన చిర కాల స్వప్నం ఈ నాటికి సాకారం అవుతున్నదుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నందమూరి కుటుంబ సభ్యులందరినీ ఈ విగ్రహావిష్కరణ సభలో పాల్గొనమని తానూ స్వయంగా ఆహ్వానిస్తానని ఆమె తెలిపారు. తెలుగు జాతి కీర్తిప్రతిష్టలకు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే నందమూరి వారి విగ్రహం దేశ రాజధాని డిల్లీలో ఆవిష్కరించబడటం తెలుగు ప్రజలందరికీ సంతోషం కలిగించే విషయమే.