TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యుగపురుషుడు ఎన్టీఆర్

Published on: Thu May 28, 2026 1:08PM

బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

 ఎన్టీఆర్ లాంటి మహనీయుడు తెలుగునేలపై పుట్టడం యావత్ తెలుగుజాతికి గర్వకారణం, అన్న ఎన్టీఆర్ యుగపురుషుడు అని నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. బే ఏరియాలో ఎన్నారై టీడీపి ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి, మినీ మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపి నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో మిల్పిటాస్ లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జరిగిన ఈ వేడుకలకు పెద్దఎత్తున టిడిపి అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారనీ, ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్ కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి మహానాడు జరుగుతున్న సమయంలోనే ఇక్కడ కూడా వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని జయరాం అన్నారు. మహానాడు రెండవరోజు మెయిన్ స్క్రీన్ పై జయరాం కోమటి ఎన్నారైల భాగస్వామ్యంపై ప్రసంగించనున్నారు. 

కార్యక్రమంలో ఎన్టీఆర్ తో కొన్ని సినిమాల్లో నటించిన ప్రముఖ రంగస్థల నటుడు అక్కిరాజు సుందరరామకృష్ణ పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది. ఆయన ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. అలాగే దానవీరశూరకర్ణ సినిమాల్లో ఎన్టీఆర్ హావభావాలను అనుకరించి అందరినీ ఆకట్టుకున్నారు. 78 సంవత్సరాల వయస్సు గల ఆయన గతంలో జమునతో కలిసి శ్రీకృష్ణరాయబారం నాటకాలను వివిధ చోట్ల ప్రదర్శించారు. ఎన్నారై టీడిపి నాయకుడు వెంకట్ కోగంటి ఈ వేడుకల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా చిన్నారులచేత కేక్ కట్ చేయించారు. తరువాత జూమ్ మీటింగ్ ద్వారా మెయిన్ మహానాడును వీక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, వీరు ఉప్పల, విజయ్ సాగర్ రెడ్డి, సీతారాం కొడాలి, అంబటి సతీష్, వాసు బండ్ల, భాస్కర్ అన్నె, సురేంద్ర కారుమంచి, శ్రీనివాస్ వల్లూరిపల్లి, జగదీష్ గింజుపల్లి, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, కోన నరేంద్రనాథ్ రెడ్డి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, రవికిరణ్ ఆలేటి, రాఘవయ్య, రాజశేUర్ పర్వతనేని, చంద్రశేఖర్ తిరుమలపుత్ర, రాంబాబు మానుకొండ, మోహన్ శ్రీకాంత్ పచవ, కళ్యాణ్ వీరపనేని, వీరబాబు పత్తిపాటి, లోకేష్, ధీరజ్ కావూరి, మురళీ, కృష్ణ చెరుకుళ్ళ, మునిరెడ్డి, శివ అద్దంకి, నవీన్ కొడాలి, అనిల్ రెడ్డి దప్పిలి, సుధీర్ నెల్లూరు, శ్రీనివాస్ వెలగపూడి, సురేష్ బాబు రాగలపల్లి, మధుసూదన్ రెడ్డివారి, బిల్ల భగవాన్ తో పాటు మహిళా ప్రముఖులు సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, విలేఖ్య వెనిగళ్ళ, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి శిరియాలు నెల్లూరి, దివ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.