TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి ఇంటికి మరోసారి నోటీసులు 

Published on: Thu Mar 13, 2025 11:42AM

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  మరోసారి  మాదాపూర్ ఇంటికి నోటీసులు అతికించారు. మొయినా బాద్ తోల్కట్ట ఫాం  హౌజ్ లో కోడి పందాలు నిర్వహిస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీకి గతంలో నోటీసులు ఇచ్చిన మొయినాబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేస్తూ శుక్రవారం విచారణకు రావాలని పేర్కొన్నారు.  గత నెలలో పోచంపల్లికి చెందిన ఫాం హౌజ్ లో  కోడి పందాలు  నిర్వహించారు. పోలీసులు దాడులు చేస్తే 64 మంది పట్టుబడ్డారు. ఈ కేసులో ఎమ్మెల్సీ ని నిందితుడిగా చేర్చారు.  గతంలో పోచంపల్లి తన న్యాయవాది ద్వారా నోటీసులకు జవాబిచ్చారు. ఈ జవాబుకు సంతృప్తి చెందని మొయినాబాద్ పోలీసులు మరో సారి నోటీసులు జారి చేస్తూ పోచంపల్లిని వ్యక్తిగతంగా హజరు కావాలని పేర్కొన్నారు.