కాశ్మీర్లో మళ్లీ దాడి.. జవాన్లకు గాయాలు

 

కాశ్మీర్లో కాస్త పరిస్థితి నెమ్మదించింది అనే లోపునే మళ్లీ దక్షిణ కాశ్మీర్ లో అనుమానిత ఉగ్రవాదులు మళ్లీ దాడికి పాల్పడి కలకలం రేపారు. వివరాల ప్రకారం.. దక్షిణ శ్రీనగర్ లోని కుల్గామ్ జిల్లాలోని ఒక గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా దాడి జరిగింది. ఉగ్రవాదులు ప్రయోగించిన గ్రెనేడు గురితప్పి రోడ్డు పక్కకు పడి పేలింది. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు ఐదుగురికి తీవ్రగాయలవ్వగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.