నిహాన్ హిడాంక్యోకు నోబెల్ శాంతి పురస్కారం
Published on: Fri Oct 11, 2024 4:15PM
.webp)
అణ్వాయుధాలు, అణుయుద్ధాలు లేని ప్రపంచాన్ని సాధించేందుకు కృషి చేస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోకు 2024 నోబెల్ శాంతి బహుమతి లభించింది. నాగసాకి అణుబాంబు దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నే సంస్థ నిహాన్ హిడాంక్యో. అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం పోరాడుతున్న ఈ గ్రూప్ ను నోబెల్ కమిటీ అత్యున్నత శాంతి బహుమతిని ప్రకటించింది.
అణ్వాయుధాలను మళ్లీ వాడకూడదన్న డిమాండ్ తో నిహాన్ హిడాంక్యో సంస్థ పలు ప్రదర్శనలు నిర్వహించింది. అణ్వాయుధ రహిత సమాజం కోసం పోరాడుతున్న నిహాన్ హిడాంక్యో కృషికి గుర్తింపుగా ఆ సంస్థను ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించింది.


