కొత్త సంవత్సరానికి 'తెలంగాణ'

 

 

 

రాష్ట్ర విభజన విషయంలో ముందుకే వెళ్తాం. నవంబర్ 15 నాటికి ముసాయిదా బిల్లు రెడీ అవుతుంది. కొత్త ఏడాది నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయ'ని తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్యనేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. దీనిపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. 'విభజనపై మేం వెనక్కు పోయామని, సందిగ్ధంలో పడ్డామని ఎవరైనా అంటే నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని ప్రజలకు వివరించండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని వివరించండి. భారీ స్థాయిలో సమావేశాలు నిర్వహించండి. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్లండి' అని దిగ్విజయ్ పేర్కొన్నారు.