ఏపీ లో హై స్కూల్ విద్యార్థులకు ' నో ఎగ్జామ్స్'!

ఆంధ్ర ప్రదేశ్ లో హైస్కూల్ విద్యార్థులకు పరీక్షలు లేవు.6 నుండి 9 వరకు విద్యార్థులు పరీక్షలు వ్రాయకుండానే పై తరగతి కి ప్రమోషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు కాబట్టి-ఈ నిర్ణయం తో 6 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకూ చదివే విద్యార్థులెవరూ , ఈ ఏడాది వార్షిక పరీక్షలు రాయకుండానే, పై తరగతులకు ప్రమోట్ అవుతారు.