TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ

Published on: Thu Oct 24, 2024 11:33AM

ప్రపంచం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో సమష్టిగా అందరూ కలిసిరావాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని తేల్చి చెప్పారు. బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంలో అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.  రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో  ప్రసంగించిన మోడీ  ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అందరూ ఏకతాటిపై నిలిచి, పరస్పరం మద్దతు సహకారంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

భారత్‌ ఎప్పుడూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికే మద్దతు తెలుపు తుందన్నారు. శాంతి చర్చల ద్వారానే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి పరిష్కారం లభిస్తుందని మోడీ అన్నారు. కొవిడ్‌ లాంటి మహమ్మరిని  సమష్టిగా ఎదుర్కొన్న తరహాలోనే మనమంతా కలిసి భావి తరాలకు భద్రతమైన, పటిష్ఠమైన భవిష్యత్తును అందించేందుకు  అవకాశాలను సృష్టించాలని మోదీ సూచించారు.