ఆంధ్రోళ్ళకి బస్సు పాస్‌లు ఇవ్వం!

 

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే వుంది. ఎన్నోరకాలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకి అన్యాయం, అవమానాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో అవమానం ఎదురైట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా మధిర బస్ డిపో మేనేజర్ సీమాంధ్రకు చెందిన విద్యార్థులకు కళ్ళు తిరిగిపోయే ప్రకటన ఒకటి డిపో నోటీస్ బోర్డులో పెట్టారని సమాచారం అందుతోంది. మధిర డిపోలో కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే బస్ పాస్‌లు ఇస్తామని, ఆంధ్రోళ్ళకి బస్సు పాస్‌లు ఇవ్వమని ఆ నోటీసులో వుందట. త్వరలో విద్యాసంస్థలు మొదలవుతున్న సమయంలో ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో చదువుకుంటున్న సీమాంధ్రకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఏం చేయాలో పాలుపోకుండా వున్నారు.