TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డు వేయాలంటూ వినూత్న నిరసన

Published on: Mon Apr 20, 2026 5:12PM

ఎస్పీఎఫ్ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో డాక్పొడి టు సైదాపురం డబల్ రోడ్డు వేయాలని కలిచేడు బస్టాండ్ లో నులక మంచం వేసుకొని రాస్తారోకో చేసి వాహనాలను స్తంభింప చేయడం జరిగింది ఎస్పీఎఫ్ వ్యవస్థాపకుడు షఫీహరణ  మాట్లాడుతూ...  రైతులు ఈ సమస్య మీద 9 నెలల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనీ సగం రోడ్డు వేసి.. మిగతా సగం రోడ్డు వేయకుండా ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని విమర్శించారు.

వారం రోజుల్లో రోడ్డు వేస్తారో లేదో తెలపాలనీ,  లేని  పక్షంలో     సీఎం ఆఫీస్ కి వెళ్తామని హెచ్చరించారు.  ఎమ్మెల్యే, ఎంపీ,  మినిస్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు.  ఇది రేపు ఎలక్షన్లో చాలా ప్రభావం చూపిస్తుందని దయచేసి స్పందించాలని కోరారు అలాగే గ్రామ మాజీ సర్పంచ్ గుమ్మడి వీరస్వామి  మాట్లాడుతూ రోడ్డు సగం వేసి ఆపడం ప్రమాదాలకు కారణమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  త్వరగా రోడ్డు కంప్లీట్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంజు నారాయణ మల్చేడు కలిశాడు వడ్డిపాలెం కట్టుమూడుపల్లి దేవరూరు తలుపూరు తురుమెల్ల రైతులు యువత విద్యార్థులు పాల్గొన్నారు