మోదీకి పోటీగా తెలంగాణ రైతులు నామినేషన్

 

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడుత పోలింగ్ జరిగిన నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి భారీ ఎత్తున పసుపు రైతులు నామినేషన్లు వేసి.. దేశ్యాప్తంగా చర్చకు తెరతీశారు. ఇప్పుడు పసుపు రైతులు ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తోన్న వారణాసి లోక్‌సభ స్థానంపై దృష్టిసారించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇప్పటికే  వారణాసి చేరుకున్న 50 మంది నిజామాబాద్ పసుపు రైతులు.. ఈరోజు నామినేషన్లు వేయనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మోదీపై పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, దేశ ప్రజల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని రైతులు అంటున్నారు.