వాచ్ బుక్ చేస్తే ఏం పార్శిల్ వచ్చిందో తెలుసా...?

 

ఆన్ లైన్ లో జరిగే మోసాలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఫోన్ బుక్ చేస్తే ఏదో ఇంటికొస్తుంది.. ఏదో బుక్ చేస్తే.. ఇంకేదో వస్తుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ చాలానే చూశాం. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్, జిల్లాలోని బీర్కూర్‌ మండలం బరంగరెడ్డికి చెందిన అశోక్‌ ఆన్‌లైన్‌లో రిస్ట్‌ వాచ్‌ బుక్‌ చేశాడు. తీరా ఇంటికి వచ్చిన పార్శిల్ తీసి చూసి షాకయ్యాడు. పార్మిల్ లో వాచ్ బదులు  సిమెంట్‌ రాయి వచ్చింది. ఈ నేపథ్యంలో అశోక్‌ బాధపడుతూ.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.700 చెల్లించి రిస్ట్‌వాచ్‌ బుక్‌ చేశానని.. పార్శిల్‌ ఆనందంతో తెరిచి చూడగా వాచ్‌కి బదులు సిమెంట్‌ రాయి, ఐరాన్‌ రాడ్‌ కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశాడు.