నిజాం సుగర్స్ ఫైనాన్స్ జీఎం... పుట్టినరోజు నాడే...
posted on Aug 6, 2014 6:13AM
నిజాం షుగర్స్ లిమిటెడ్ కంపెనీ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ ముప్పల జానకిరాం శర్మ (59) సోమవారం తన కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుట్టినరోజు నాడే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈమధ్యే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ పదవిలో కొనసాగుతున్నారు. సోమవారం ఆఫీసుకు వచ్చిన ఆయన అటెండర్కి డబ్బు ఇచ్చి ఒక తాడు తెప్పించుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శర్మ సిబ్బందిని ఇంటికి పంపేశారు. తండ్రి రాక కోసం, ఆయన పుట్టినరోజు వేడుకలు జరపాలని రాత్రి 11 గంటల వరకు ఎదురుచూసిన కొడుకు శ్రీనివాస్ తండ్రికి ఫోన్ చేయగా అది కలవలేదు. దాంతో శ్రీనివాస్ కార్యాలయానికి వెళ్లగా శర్మ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించారు. కార్యాలయంలో పనిభారం ఎక్కువగా వున్నందువల్ల ఆయన ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.