నిఠారి దోషులకు రాష్ట్రపతి క్షమాబిక్ష నిరాకరణ

 

2005-2006 మధ్యకాలంలో పలువురు చిన్నారుల మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన నిఠారీ హత్యల కేసులో దోషులుగా నిరూపణ అయిన ఐదుగురికి మరణశిక్ష ఖరారైంది. తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ ఐదుగురూ పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. దాంతో వీరికి ఉరి ఖాయమైంది. త్వరలో వీరిని ఉరి తీస్తారు. ఈ కేసులో కోలీతోపాటుగా మహారాష్టక్రు చెందిన అక్కాచెల్లెళ్లు రేణుకాబాయి, సీమా, అదే రాష్ట్రానికి చెందిన రాజేంద్ర ప్రహ్లాద్‌రావు వాస్నిఖ్, మధ్యప్రదేశ్‌కు చెందిన జగదీష్, అసోంకు చెందిన హోలీరామ్ బోర్డోలికి త్వరలో ఉరిశిక్ష అమలు చేయనున్నారు.