నిమ్మకూరులో జగన్‌కు చేదు అనుభవం

 

కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు సొంతఊరు నిమ్మకూరులో పర్యటిస్తున్న జగన్‌, అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేయాలనుకున్నారు అయితే ఎన్టీఆర్‌ అభిమానులు ఆయన్ను అడ్డుకున్నారు. జగన్‌ పూల మాల వేస్తే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పాలతో శుద్ది చేస్తామని అభిమానులు హెచ్చరించారు. దీంతో జగన్‌ పూలమాల వేయకుండానే వెనుదిరిగారు. తరువాత ఎన్టీఆర్‌ బంధువు పెద వెంకటేశ్వరరావు ఇంటికి జగన్‌ వెళ్లారు.