నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు
posted on Oct 7, 2013 6:35PM
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ లబించింది. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు ఇవాళ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకాలం సిబిఐ వీరి బెయిల్ పిటిషన్ లను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇప్పుడు దర్యాప్తు పూర్తి అయినందున కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు జగన్ కు సన్నిహితుడిగా పేరుపడి జగన్ కోసమే 20 నెలలుగా జైలులో ఉన్నట్లు పేరుపడ్డ నిందితుడు సునీల్ రెడ్డి ఎట్టకేలకు బెయిల్ మీద ఈ రోజు చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యాడు. రూ.2 లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిలు మంజూరయింది.