క్రైం యాంకర్.. క్రిమినల్ అయిపోయాడు.. 10 కోట్లు డిమాండ్

 

టీవీ ఛానల్‌లో గంభీరంగా క్రైం వార్తలు చెప్పే యాంకర్ హర్షవర్ధన్ తాను చదివే వార్తల పుణ్యమేమోగానీ, తాను కూడా క్రిమినల్ అయిపోయాడు. ఓ కాలేజీ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేయడంతో విజయవాడ పోలీసులు హర్షవర్ధన్‌ని అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్‌ ఫాదర్‌ పి.బాలను హర్షవర్ధన్ 5 కోట్ల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే ఒక ప్రముఖ టీవీ చానెల్‌లో కాలేజీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దాంతో బాల పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగి హర్షవర్ధన్‌తోపాటు అతనికి సహకరిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.