TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టిటిడి కొత్త పాలకమండలి ప్రమాణస్వీకారం

Published on: Wed Aug 29, 2012 1:00PM

టిటిడి పాలకమండలి పాలనా గడువు ముగియడంతో కొత్త పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టిటిడి చైర్మన్ బాపిరాజు మరో రెండు సంవత్సరాల పాటు చైర్మన్ పదవిలో కొనసాగేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిటిడి చైర్మన్ పదవి కోసం రాయపాటి సాంబశివరావు, మాజీ టిటిడి పాలకమండలి చైర్మన్లు టి.సుబ్బిరామిరెడ్డి, ఆదికేశవులు నాయుడు పోటీ పడినప్పటికీ ప్రభుత్వం బాపిరాజుకు చైర్మన్ పదవిని కట్టబెట్టింది. బుధవారం 13 మంది సభ్యుల్లో చైర్మన్ బాపిరాజుతో పాటు ఎనిమిది మంది సభ్యుల ప్రమాణ స్వీకారం ఉన్నందువల్ల జేఈవో శ్రీనివాసరాజు బుధవారం రాత్రి విఐపి దర్శనాలను రద్దుచేశారు. మిగిలిన్ ఐదుగురు సభ్యులు ఈనెల 30 లేదా 31న గానీ ప్రమాణస్వీకారం చేస్తారు.