నేపాల్ విమానం క్రాష్- ముగ్గురు భారతీయులు సహా 22 మంది మృతి
Published on: Sun May 29, 2022 5:50PM
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 22 మందితో ప్రయాణిస్తున్న విమానం ఈ ఉదయం పోఖారాలో టేకాఫ్ తీసుకున్న పావుగంటకే గల్లంతైంది.
చివరికి ఆ విమానం లామ్చే నది వద్ద కుప్పకూలినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 19 ప్రయాణీకులు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణీకులలో ముగ్గురు భారతీయులు ఉన్నారు.
విమానంలో ఉన్న వారందరూ మరణించినట్లు భావిస్తున్నారు. విమానాల శకలాలను లాచ్చే నది సమీపంలో గుర్తించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.


