బెట్టింగ్ కేసులో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు

నెల్లూరు నగరంలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కోట్ల రూపాయలు చేతులు మారిన ఈ బెట్టింగ్ కేసులో దాదాపు 115 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో క్రికెట్ బుకీల వెనుక రాజకీయ హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేసులో పట్టుబడిన నిందితులు విచారణలో వైసీపీ ఎమ్మెల్యేల పేరు చెప్పినట్లు నగరంలో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన ఎస్సీ రామకృష్ణ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.