ఆంధ్రప్రదేశ్‌కి అండగా వుంటాం.. వెంకయ్య...

 

అడ్డగోలు విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అండగా వుంటుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలా సహకరిస్తారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం నెల్లూరులో సర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్య నాయుడు అని కొనియాడారు. స్వర్ణభారతి ట్రస్ట్ యువతలో నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమం చేపడుతోందన్నారు. నైపుణ్యం గల పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉండటం మనకు గర్వకారణమని చంద్రబాబు అన్నారు.