రెచ్చిపోయిన మావోయిస్టులు... రైల్వే స్టేషన్ పై దాడి..

 

గత కొద్ది రోజుల నుండి భీభత్సం సృష్టిస్తున్న మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. ఈసారి రెైల్వే స్టేషన్ పై దాడి చేశారు. వివరాల ప్రకారం... జార్ఖండ్ జిల్లా బొకారో సమీపంలోని డుమ్రి బిహార్ రైల్వే స్టేషన్ పై మావోయిస్టులు దాడి చేసి స్టేషన్ లోని సిగ్నల్ సెట్, సమాచార వ్యవస్థకు నిప్పుపెట్టారు. అంతేకాదు.. అక్కడికి సమీపంలోనే ఉన్న గూడ్స్ రైలు ఇంజన్ ను ధ్వంసం చేశారు. దీంతో  కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం కలిగింది. మరోవైపు ఈ ఘటన వల్ల ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కనీసం 20 మంది వరకూ నక్సల్స్ దాడికి పాల్పడ్డారని.. వారు ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.