పెళ్ళయిన వాళ్ళలోనే ఆత్మహత్యలు ఎక్కువట.. ఎందుకో!

 

ఆత్మహత్యలు అనే అంశం మీద జాతీయ నేర నమోదు బ్యూరో (ఎన్సీఆర్బీ) అనే సంస్థ బాగా పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో తేలిన అంశం ఏమంటంటే, ఒంటరి జీవితాన్ని గడిపేవారికంటే పెళ్ళయిన వారే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి పరిశోధించాల్సిన అవసరం లేదు. మామూలుగానే అందరికీ తెలిసిన విషయమే ఇది. ఒంటరిగా వున్నవారికి ఎలాంటి వేధింపులు, సాధింపులు వుండవు. అదే పెళ్ళయిన వారికి ఎన్ని వేధింపులు వుంటాయో పెళ్ళి చేసుకున్నవారికే తెలుస్తుంది. అయినా పెళ్ళయిన వాళ్ళలోనే ఆత్మహత్యలు ఎక్కువ ఎందుకంటే... పెళ్ళే అన్నిటికన్నా పెద్ద ఆత్మహత్య అనే వాళ్ళూ వున్నారు. సరే, ఇలాంటి అభిప్రాయాల సంగతి అటు వుంచితే, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది కాబట్టి, శాస్త్రీయంగా పరిశోధించి చెప్పిన వాటికే ప్రామాణికత వుంటుంది. ఎన్సీఆర్బీ పరిశోధన ఫలితాలకు అందుకే వాల్యూ వుంది. ఈ పరిశోధన, పరిశీలన ప్రకారం 2013లో ఆత్యహత్య చేసుకున్న వారిలో 69.4శాతం మంది పెళ్ళయిన వారు ఉండగా, 23.6 శాతం మంది ఒంటరివారని ఎన్సీఆర్బీ తన నివేదికలో వెల్లడించింది. అలాగే 3.7 శాతం మంది పెళ్ళయ్యాక ఒంటరితనం వచ్చినవాళ్లు!