యుద్ధనౌక.. జాతికి అంకితం

 

దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ కోల్‌కతా’ని భారత ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలో వైభవంగా జరిగిన కార్యక్రమంలో మోడీ ఈ భారీ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, భారతదేశంలోని ప్రజలు ప్రశాంతంగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం మన సైనికులేనని అన్నారు. ఐఎన్ఎస్ కోల్‌కతా నౌక కారణంగా మన నావికాదళం మరింత బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు. సరిహద్దుల భద్రతతోపాటు సముద్రంలో కూడా భద్రత ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ఛత్రపతి శివాజీ కూడా సముద్ర రక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.