TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నరసన్నపేటలో పోటాపోటీ ప్రచారం

Published on: Thu May 3, 2012 10:09AM

శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గ్రామాల్లో కార్యకర్తల ద్వారా చాప కింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. కాలింగ, ఎస్సే సామాజికవర్గం ఓట్లపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు. ఈయన ప్రచారానికి పెద్దసంఖ్యలో కార్యకర్తల మద్దతు లభిస్తోంది.

 

 

టిడిపి అభ్యర్థి గెలుపు బాధ్యతను ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు తీసుకున్నారు. నియోజకవర్గంలో 900మందితో డెడికేటెడ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసి గ్రామగ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన కె.ప్రతిభాభారతి, తమ్మినేని సీతారాం, గౌతు శ్యామసుందర శివాజీ, అచ్చెంనాయుడు తదితరలు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.

 

 

కాంగ్రెస్  పార్టీ తరపున ధర్మాన ప్రసాదరావు, తమ్ముడు ధర్మాన్ రాందాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల బాధ్యతను మంత్రి ధర్మానప్రసాద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ముఖ్యమైన నాయకులను గ్రామాలకు పంపించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తున్నారు ఈ నియోజకవర్గంలో 150 పంచాయితీలకు ప్రత్యేకంగా ఇన్ ఛార్జిలను నియమించారు. ఈ మూడు పార్టీలు నసరన్నపేట ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం గట్టిగా శ్రమిస్తున్నారు.