ఎన్టీఆర్ బయోపిక్.. నారా లోకేష్ వాట్ ఏ ట్వీట్

 

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. అభిమానులు, ప్రేక్షకులు మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ చిత్రం గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'సామాన్య కుటుంబంలో జన్మించి వెండితెర ఇలవేల్పుగా ఎదిగి, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి చరిత సృష్టించిన తాతగారి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'కథానాయకుడు' సినిమా ఈరోజు విడుదలై అపూర్వ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మామయ్య బాలకృష్ణకు, చిత్ర బృందానికి అభినందనలు.' అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.