రైతన్నకు ఒరిగింది ఏంటి? యుశ్రారైకాపా రంగుల లోకం తప్ప

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని జగన్ సర్కార్ 'రైతు దినోత్సవం'గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

"ఈ రోజు వైఎస్ జగన్ 'రైతు దగా దినోత్సవం'. విత్తనాలు ఇవ్వలేని కొడుకు, 14 వేల మంది రైతుల్ని బలిగొని వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిన తండ్రి జన్మదినాన్ని రైతు దినోత్సవం అంటూ ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం వృధా చెయ్యడం దారుణం." అని లోకేష్ వ్యాఖ్యానించారు.

"వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో కోత, భరోసా లో కోత, గిట్టుబాటు ధర అడ్రెస్స్ లేదు, ఏడాదికి లచ్చ రూపాయిల లబ్ది రత్నం గల్లంతు, గత ప్రభుత్వ హయాంలో ఉన్న సున్నా వడ్డీకి పేరు మార్పు, ఉచిత విద్యుత్ పథకానికి పేరు మార్పు. రైతన్నకు ఒరిగింది ఏంటి? యుశ్రారైకాపా రంగుల లోకం తప్ప." అని విమర్శించారు లోకేష్.

అన్నట్టు లోకేష్ వాడిన 'యుశ్రారైకాపా' పదం అర్థమైందో లేదో. 'యుశ్రారైకాపా' అంటే 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'కి షార్ట్ ఫామ్ అన్నమాట.