రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ!

 

సభా కార్యక్రమాలకు నిత్యం అడ్డుపడుతున్నారన్న కారణంతో.. ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చెయ్య చౌదరిలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తరలిస్తున్న చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన లోకేష్, "వారెవా.. ప్రజల పక్షాన నిలిస్తే..  రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ.. !" అని వ్యాఖ్యానించారు.