పల్లె మనదే.. పట్నం మనదే..

పల్లెలు గెలిచాయి ఇప్పుడిక  మన వంతు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై పల్లెలు గెలిచాయని, ఇప్పుడిక మనవంతు అని ట్విటర్‌లో అన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేశామని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని కోరారు. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు. 21 నెలల జగన్ రెడ్డి పాలనలో పట్టణాల అభివృద్ధి శూన్యమన్నారు. కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వాన్ని చూశామన్నారు లోకేశ్ విమర్శించారు.  ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసాడని, మరో ఛాన్స్ ఇస్తే ప్రజల జీవితాలను పాతరేస్తాడని  సీఎం జగన్‌ను ఉద్దేశించి లోకేశ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆలోచించి ఓటు వెయ్యండని అంటూ  ట్విటర్‌లోఅన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో టీడీపీ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసామని తెలిపారు.