2019లో బీజేపీకి అసలు సినిమా

ప్రస్తుతం బీజేపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. ఇరు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు.. తాజాగా ఏపీ పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బీజేపీపై మండిపడ్డారు.. 'కర్ణాటక ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, బీజేపీకి అసలు సినిమా 2019 లో కనిపిస్తుంది, బీజేపీ భవిష్యత్తు గల్లంతే' అని లోకేష్ అన్నారు.. బీజేపీ,  ప్రత్యేకహోదా ఇస్తామని మాటలతో మభ్యపెట్టి కాలయాపన చేసింది, ఏపీకి ఇచ్చిన హామీల్లో బీజేపీ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న లోకేష్.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేందుకు 25 ఎంపీ సీట్లు గెలిపించి సీఎం చంద్రబాబుని ఆశీర్వదించాలని కోరారు.. అలానే వైసీపీ 2015 నుండి రాజీనామా డ్రామా ఆడిందని, ఉపఎన్నికలు రావని తెలిసాకే ఇప్పుడు రాజీనామా పత్రాలు ఇచ్చారని మండిపడ్డారు.