విష్ణుకుమార్ రాజు కు లోకేష్ కౌంటర్..మీరు తెచ్చినా అంతే..


 ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు కు కౌంటర్ ఇచ్చారు. విశాఖపట్నం ఐటీ హబ్ కు వస్తున్న ఐటీ కంపెనీల గురించి, ఐటీ సంస్థల భూముల గురించి ఆయన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక  విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ఐటీ నింబంధల ప్రకారమే సంస్థలకు భూములు ఇస్తున్నామని.. ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేస్తున్నవారు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చినా... 21 రోజుల్లోనే భూములు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి బయట ఉన్న పార్టీ సభ్యులు, లోపలే ఉండి విమర్శలు చేస్తున్న సభ్యులు తెలుసుకునేందుకే తాను ఈ విషయాలను చెబుతున్నానని అన్నారు.