ప్రజారాజ్యం వైకాపా దొందుకు దొందే: లోకేష్

 

ప్రత్యక్ష రాజకీయ వేదికలకంటే ట్వీటర్ లోనే ఎక్కువ కనిపించే నారా లోకేష్ మళ్ళీ తమ ప్రత్యర్ద వైకాపా పైకి మరో ట్వీట్ బాణం సందించాడు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి, తరువాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీల మధ్య అట్టే తేడా లేదని, కేవలం విలీనం, పొత్తులనే అంశాలలోనే కొద్దిపాటి తేడాలుంటే ఉండవచ్చని, మిగిలిన విషయాలలో రెండూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ప్రజారాజ్యం ఏవిధంగా సీట్లను నోట్లకి అమ్ముకొందో ఇప్పుడు వైకాపా కూడా అదే చేస్తోందని ట్వీట్ చేసారు. దీనిపై వైకాపా ఎలా స్పందింస్తుందో ఊహించడం కష్టమేమి కాదు. అయితే లోకేష్ కూడా తన ట్వీట్ లోకం నుండి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి లాగ ప్రత్యక్షరాజకీయాలలోకి వచ్చి చురుకుగా పాల్గొంటూ ఉంటే, అతని మాటలకు విలువ ఏర్పడేది.