నాన్నని చూస్తే తాతగారిని చూసినట్టే..

 

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై నారా బ్రాహ్మణి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో బాలకృష్ణ, క్రిష్, అనుష్కలతో కలిసి ఆమె ఈ చిత్రాన్ని చూశారు. అనంతరం బ్రాహ్మిణి మాట్లాడుతూ.. తెరపై నాన్నని కాకుండా తాతగారినే చూసినట్టుందన్నారు. 'మా తాత గారితో కొన్ని రోజులు మాత్రమే గడిపాను. తారకం నాన్నమ్మని అసలు చూడలేదు. నేను పుట్టక ముందే ఆమె చనిపోయారు' అని బ్రాహ్మిణి చెప్పారు. కానీ.. సినిమాలో తాత-నాన్నమ్మ పాత్రలను చూస్తూంటే వారిద్దరినీ చాలా మిస్ అయ్యానని అనిపిస్తోందని అన్నారు. ప్రతి పాత్రలో అందరూ జీవించారని బ్రాహ్మిణి కొనియాడారు.