ముగిసిన నంద్యాల ఉపఎన్నిక పోలింగ్...

 

నంద్యాల ఉపఎన్నికకు పోలింగ్ ముగిసింది. గ‌తంలో ఎన్న‌డూలేని రీతిలోభారీగా పోలింగ్ న‌మోదైంది. ఆ నియోజకవర్గంలో మొత్తం దాదాపు 80 శాతం కంటే ఎక్కువగానే పోలింగ్ న‌మోద‌యిన‌ట్లు తెలుస్తోంది. ఇక క్యూలైన్లో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చారు అధికారులు. అయితే ఈ పోలింగ్ లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నట్టు సమాచారం. కాగా పోలింగ్ సందర్బంగా వైసీపీ, టీడీపీ మధ్య మూడు ప్రాంతాల్లో గొడవలు చోటుచేసుకున్నాయి.