శిల్పా మోహన్ రెడ్డి ఆఫర్... తక్కువ ధరకు సరుకులు...

 

నంద్యాల ఉపఎన్నిక పోరు వాడీ వేడీగా జరుగుతోంది. ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న టీడీపీ, వైసీపీలు రెచ్చిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇక ఎన్నికల ప్రచారం గడువు కూడా నిన్నటితో పూర్తయింది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్ధి ఓటర్లకు  ఓ బంపరాఫర్ ఇచ్చాడు. వైసీపీ నుండి శిల్పా మోహన్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే  శిల్పా మోహన్ రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న శిల్పా సహకార మార్కెట్ లో తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు ఇస్తామని ప్రకటన చేయడంతో.. అక్కడికి వందలాది మంది గుమికూడి సరుకులను తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడంతో..  ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో, తనిఖీలు చేసిన ఎన్నికల అధికారులు, ఆ ఆరోపణలు నిజమని తేల్చి, సిబ్బందిని బయటకు పంపించి, స్టోర్ ను మూసివేయించారు.