అదే నా ఆస్తి...


నంద్యాల ఉపఎన్నికలో జగన్ చాలా జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజుతో జగన్ ప్రచారం 8వ రోజుకు చేరుకుంది.  చింత అరుగులో రోడ్ షోలో పాల్గొన్న ఆయన.. రోజూలాగే టీడీపీ పై విమర్శలు గుప్పించారు. అధర్మానికి వ్యతిరేకంగా, ధర్మానికి మద్దతుగా ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఉప ఎన్నికలు వచ్చినందుకే ఇక్కడకు అందరూ వస్తున్నారని... ఇంతకు ముందెప్పుడైనా చంద్రబాబును కాని, ఆయన కుమారుడు లోకేష్ ని కాని, మంత్రులను కాని నంద్యాలలో చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్ధాలను చెప్పలేనని... విశ్వసనీయతే తనకున్న ఆస్తి అని చెప్పారు.