ప్రశాంతంగా కొనసాగుతున్న నంద్యాల ఉప ఎన్నిక

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తి నెలకొన్న నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ తరపున శిల్పా మోహన్‌రెడ్డి బరిలో నిలిచారు. వీరితో పాటు మరో 13 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ దృష్ట్యా నంద్యాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 3500 మంది రాష్ట్ర పోలీసులతో పాటు, 10 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.