తంగిరాల మృతి పార్టీకి తీరని లోటు: బాబు

 

 

 

గుండెపోటుతో హఠాన్మరణం పొందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేను ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి బాధాకరమైన విషయమని, కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తంగిరాల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. దేవినేని కుటుంబం తరువాత నందిగామ నియోజకవర్గానికి తంగిరాల పేరు తెచ్చారని బాబు గుర్తుచేశారు. అందరితో కలివిడిగా ఉండే తంగిరాల మన మద్య లేకపోవడం పార్టీకి తీరని లోటు అని, పదవులను ఆశించకుండా పని చేసిన వ్యక్తి తంగిరాలని చంద్రబాబు సంతాపం ప్రకటించారు. గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, మండలి బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మంత్రి దేవినేని ఉమ తంగిరాల బౌతికకాయానికి నివాళులర్పించారు.